Today Stock Market Down

Today Stock Market Down: భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇన్వెస్టర్లను ఆశించినంతగా ఆకట్టుకోలేదు. ఈ డీల్ అనంతరం మార్కెట్ సూచీలు భారీగా లాభపడతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. కానీ అంచనాలకు భిన్నంగా మార్కెట్ వెనకడుగు వేస్తోంది. డీల్‌పై అమెరికా అభ్యంతరాలు వ్యక్తం చేయడం కారణమా, లేక అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావమా అన్నది స్పష్టంగా లేకపోయినా, మంగళవారం మార్కెట్ నష్టాల్లోనే కొనసాగుతోంది.

ప్రస్తుతం సెన్సెక్స్ 423 పాయింట్లు తగ్గి 81,114 వద్ద, నిఫ్టీ 104 పాయింట్లు పడిపోయి 24,943 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, JSW స్టీల్ లాభాల్లో ఉండగా, M&M, కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, ఎటర్నల్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ నష్టపోయాయి. మెటల్ రంగం తప్ప మిగతా అన్ని రంగాల సూచీలు, ముఖ్యంగా ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ సుమారు 1 శాతం మేర నష్టపోయాయి.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

LG ఎలక్ట్రానిక్స్ షేరు ధర IPO ధర కంటే 51% పెరిగింది..

External Links:

రుచించని భారత్-ఈయూ డీల్.. భారీ నష్టాల్లో సూచీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *