తమిళనాడులోని ఓ రిటైర్డ్ టీచర్ నివాసంలో ఓ దొంగ చోరీకి పాల్పడ్డాడు. విశ్రాంత ఉపాధ్యాయులు అయిన సెల్విన్ మరియు అతని భార్య జూన్ 17న చెన్నైలో తమ కుమారుడిని కలవడానికి బయలుదేరినప్పుడు మేగ్నానపురంలోని సాతంకుళం రహదారిలో ఈ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. దంపతులు లేని సమయంలో ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి ఇంటి పనిమనిషి సెల్విని నియమించుకున్నారు. జూన్ 26న సెల్వి సెల్విన్ ఇంటికి వెళ్లగా.. మెయిన్ డోర్ తెరిచి ఉండడంతో షాక్ కు గురైంది. వెంటనే సెల్విన్‌కు సమాచారం అందించింది. సెల్విన్ ఇంటికి చేరుకుని చూడగా రూ.60 వేలు, 12 గ్రాముల బంగారు నగలు, ఒక జత వెండి పట్టిలు దోచుకెళ్లినట్లు గుర్తించారు.

పోలీసులు సెల్విన్ ఇంటిని శోధించినప్పుడు, దొంగ వదిలిపెట్టిన క్షమాపణ లేఖను కనుగొన్నారు, అందులో అతను క్షమాపణలు చెప్పాడు మరియు దొంగిలించిన వస్తువులను ఒక నెలలో తిరిగి ఇస్తానని హామీ ఇచ్చాడు. "నన్ను క్షమించండి. నెల రోజుల్లో తిరిగి ఇస్తాను. నా ఇంట్లోవాలకి బాగోలేకపోతే ఇలా చేస్తున్నాను" అని లేఖలో పేర్కొన్నారు. మేఘానాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మూడేళ్ల చిన్నారి నుంచి బంగారు హారాన్ని దొంగిలించిన ఓ దొంగ దానిని అమ్మగా వచ్చిన డబ్బును క్షమాపణ లేఖతో సహా తిరిగి ఇవ్వడంతో కేరళలో గతేడాది ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ ఘటన పాలక్కాడ్ సమీపంలో చోటుచేసుకుంది.

By Anusha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *