హైదరాబాద్: కుటుంబ సమస్యలతో మంగళవారం రాత్రి నగరంలోని కుల్సుంపురాలో ఓ వ్యతి తన భార్యను హత్య చేశాడు. సయ్యద్ సలీమ్ (43) అనే వ్యతి మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఆ తర్వాత ఆమె గొంతుకోసి హత్య చేశాడని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

సలీం తన భార్యతో తరచూ గొడవపడేవాడని, కుటుంబ పెద్దలు అతనికి కౌన్సెలింగ్‌ ఇచ్చారని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *