టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, నేరాలు కూడా పెరుగుతున్నాయి. సామాన్యులు, రాజకీయ నాయకులు, సినీ నటులు, వ్యాపారవేత్తలు అందరూ సైబర్ నేరాలకు గురవుతున్నారు. తాజాగా, తెలంగాణ ఎమ్మెల్యేను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. అక్టోబర్ 14న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసిన ఎమ్మెల్యే షాక్ అయ్యారు. ఫోన్ స్క్రీన్ పై ఒక మహిళ న్యూడ్ గా ఉండడం చూసి షాక్ అయ్యారు. వెంటనే కాల్ కట్ చేశాడు. అతడిని ఇరికించడానికి ఎవరైనా న్యూడ్ కాల్ చేశారా? లేక నిజంగా తెలియని వ్యక్తులు చేశారా? అనే అనుమానంతో వెంటనే హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానీ ఆన్‌లైన్‌లో తెలియని వ్యక్తుల లింక్‌లు, URLలను క్లిక్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని, యువతులతో వీడియో కాల్స్ చేయిస్తానని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. అంతేకాదు డబ్బు పెట్టుబ‌డుల‌పై వారు చెప్పే మాట‌ల‌ను ఎవ‌రూ నమ్మొద్ద‌ని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల విషయంలో ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని అప్రమత్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *