Ajit Pawar: మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న చిన్న విమానం బారామతి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు పైలట్లు, భద్రతా సిబ్బంది కలిపి మొత్తం ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బహిరంగ సభల్లో పాల్గొనేందుకు అజిత్ పవార్ ఈ ఉదయం ముంబై నుంచి బారామతికి బయలుదేరారు. ఉదయం 8 గంటలకు టేకాఫ్ అయిన విమానం, బారామతి ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతుండగా ప్రమాదానికి గురైంది. ప్రమాద స్థలంలో విమానం శకలాలు చెల్లాచెదురుగా పడి ఉండగా, మంటలు మరియు దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందగానే సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ హఠాత్ సంఘటనతో మహారాష్ట్ర రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం
సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో
External Links:
విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం