హైద‌రాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ల దందా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, జూబ్లీహిల్స్‌లోని వన్ అండ్ ఫైవ్ ఐస్‌క్రీమ్ పార్ల‌ర్‌పై జ‌రిపిన దాడుల్లో ఐస్‌క్రీమ్‌లో విస్కీ క‌లిపి అమ్ముతున్న‌ట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. 60 గ్రాముల ఐస్‌క్రీమ్‌లో 100 ఎంఎల్ విస్కీ క‌లిపి విక్ర‌యిస్తున్న‌ట్లు అధికారులు క‌నుగొన్నారు.ఈ ఐస్‌క్రీమ్‌ల‌ను పిల్ల‌లు, యువ‌త భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్న‌ట్లు పోలీసుల‌ దృష్టికి వచ్చింది. దీంతో త‌నిఖీలు నిర్వ‌హించి ఐస్‌క్రీమ్ పార్ల‌ర్ య‌జ‌మానులు ద‌యాక‌ర్ రెడ్డి, శోభ‌న్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. న‌గ‌రంలో వీరికి ఇంకా ఎన్ని ఐస్‌క్రీమ్ పార్ల‌ర్లు ఉన్నాయి, ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన విక్ర‌యాలు ఎన్ని? అన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ విషయం బయటకు తెలియడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని కోరుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *