Latest Breaking News

News5am, Latest Breaking News (30-05-2025): ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వాధికారులు లంచాల వేటలో పడ్డారు. కోట్లాది రూపాయలను అక్రమంగా సంపాదిస్తున్నారు. ఏసీబీ వారు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అవినీతి అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ఇటీవలి ఘటనలో, భువనేశ్వర్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ బైకుంఠనాథ్ సారంగి అవినీతిపై ఆరోపణలతో ఏసీబీ దాడులు నిర్వహించింది. అంగుల్, పూరి, కటక్, దెంకనల్ ప్రాంతాల్లో ఆయన ఇళ్లు సహా నాలుగు ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. ఈ దాడుల్లో సుమారు రూ.2 కోట్లు నగదు బయటపడింది. అంగుల్‌లోని ఇంట్లో రూ.90 లక్షలు, రాజధానిలోని ఇంట్లో రూ.1.10 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఒడిశా విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో, 8 మంది డీఎస్పీలు, 12 మంది ఇన్‌స్పెక్టర్లు, 6 మంది ఏఎస్ఐలు మరియు ఇతర సిబ్బంది కలసి రాష్ట్రంలోని ఏడు ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. సారంగి రెండు రోజుల్లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, విజిలెన్స్ అధికారులు వచ్చేసరికి ఆయన రూ.2 కోట్ల నగదును ఫ్లాట్ కిటికీ ద్వారా బయటకు విసిరి తప్పించుకునే ప్రయత్నం చేశారు. తర్వాత ఆ డబ్బు సాక్షుల సమక్షంలో స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More Latest Breaking News Today:

Latest Updated News:

కామారెడ్డిలో సైబర్ మోసం..

తెలంగాణ రాజ్ భవన్‎లో చోరీ..

More Latest Breaking News: External Sources

ఏసీబీ అధికారుల సోదాలు.. కిటికీ నుంచి రూ. 2 కోట్లు బయటపడేసిన అవినీతి అధికారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *