ఉత్తరప్రదేశ్‌లోని బల్‌రామ్‌పూర్‌లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిందితుడు మృతదేహంలోని ఒక చేయి, ప్రైవేట్ భాగాన్ని నరికేశారు. వాటితో గ్రామంలో తిరుగుతూనే ఉన్నాడు.

మృతుడి పేరు వినోద్ బిర్జియా. నిందితుడు మగధు మహువా గా గుర్తించారు. సమాచారం ప్రకారం, 35 ఏళ్ల వినోద్ కూలి పని చేసేవాడు. మద్యానికి బానిసయ్యాడు. మద్యం కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే ప్రజల ఇళ్లలో గడ్డపారలు, గొడ్డళ్లు, ఇతర చిన్నచిన్న వస్తువులను దొంగిలించి అమ్మేవాడు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇంతలో వినోద్ బిర్జియా, మగధు మహువా ఇంట్లో కూడా దొంగతనం చేశాడు. దీంతో అతడికి కోపం వచ్చింది. మగధు మహువా వినోద్‌ను హత్య చేశాడు. మృతదేహాన్ని అడవిలో పడేశాడు. మృతదేహంలోని ఒక చేయి, ఒక ప్రైవేట్‌ భాగం నరికేశాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది. నిందితుడు మగధు మహువా పరారీలో ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *