ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ప్రమాదంలో డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు మిల్క్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో 18 మంది మృతి చెందగా, 19 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 5 గంటలకు బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోజికోట్ గ్రామ సమీపంలో జరిగింది.

పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. బస్సు ఢీకొనడంతో పాల ట్యాంకర్ బోల్తా పడ్డట్లు బంగార్మావు సర్కిల్ ఆఫీసర్ (సిఓ) అరవింద్ కుమార్ తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. బాధితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *