Free Trade Agreement

Free Trade Agreement: భారత్–న్యూజిలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA)తో వాణిజ్య సంబంధాల్లో కొత్త దశ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మధ్య ఫోన్ చర్చల తర్వాత ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. కేవలం ఐదు రౌండ్లలోనే చర్చలు పూర్తవడం విశేషం. ఈ డీల్ ప్రకారం భారత్ నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లే అన్ని ఎగుమతులపై సున్నా సుంకం వర్తిస్తుంది. అలాగే రెండు దేశాల మధ్య జరిగే దాదాపు 95 శాతం వాణిజ్యానికి టారిఫ్ మినహాయింపు లభిస్తుంది.

ఈ ఒప్పందంతో వచ్చే 15 ఏళ్లలో న్యూజిలాండ్ భారత్‌లో సుమారు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, టూరిజం, విద్య రంగాల్లో భారత సంస్థలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. భారత విద్యార్థులకు చదువు తర్వాత అక్కడ పని చేసే అవకాశాలు కూడా పెరుగుతాయి. వ్యవసాయ రంగంలో ఆపిల్, కివీ, తేనె వంటి ఉత్పత్తుల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు, అయితే భారత రైతుల ప్రయోజనాల కోసం సున్నితమైన రంగాలను మినహాయించారు. ఈ ఒప్పందం వాణిజ్యంతో పాటు రక్షణ, విద్య, పర్యాటక రంగాల్లోనూ ఇరు దేశాల సహకారాన్ని బలోపేతం చేస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…

ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..

External Links:

భారత్ – న్యూజిలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్.. ఎగుమతులకు సుంకాలు సున్నా ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *