నేపాల్ భూకంపం భయాందోళనలు సృష్టిస్తోంది. టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో మంగళవారం ఉదయం 6.35 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత నమోదైంది. భూకంపం కారణంగా 32 మంది మరణించారు. భూకంపం ధాటికి ఇళ్లు నేలమట్టమయ్యాయి.

యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంప కేంద్రం నేపాల్‌లోని లోబుచేకి వద్ద 93 కి.మీ దూరంలో 10 కి.మీ లోతులో కేంద్రీకృతమైంది. నేపాల్‌లో రెండుసార్లు భూకంపాలు సంభవించాయి. మరోవైపు బీహార్ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు ఏర్పడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *