ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం టేకాఫ్ సమయంలో సౌర్య ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయిందని ఖాట్మండు పోస్ట్ తెలిపింది. పోఖారాకు వెళుతున్న విమానంలో ఎయిర్‌క్రూతో సహా 19 మంది ప్రయాణిస్తున్నారని, ఉదయం 11 గంటలకు ప్రమాదం జరిగిందని విమానాశ్రయ ప్రతినిధి ప్రేమనాథ్ ఠాకూర్ నివేదించారు. ఈ ప్రమాదంలో విమానంలోని 19 మందిలో 18 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదికలు పేర్కొన్నాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహా అత్యవసర సహాయకులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *