Operation hawkeye strike: సిరియాలో అమెరికా సైనికులు మరణించడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార చర్యలకు ఆదేశించారు. ‘ఆపరేషన్ హాకీ స్ట్రైక్’ పేరుతో ఐసిస్ ఉగ్రవాద స్థావరాలపై అమెరికా భారీ వైమానిక దాడులు చేసింది. పాల్మిరాలో జరిగిన దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు, ఒక పౌరుడు మృతి చెందడంతో ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తమ సైనికులపై దాడి చేసిన వారిని వదిలిపెట్టబోమని చెప్పిన ఆయన, వెంటనే క్షిపణి దాడులు ప్రారంభించారు. ఇది కేవలం యుద్ధం కాదు, ప్రతీకార చర్య అని అమెరికా రక్షణ శాఖ తెలిపింది.
ఈ దాడుల్లో అమెరికా ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, ఆర్టిలరీని ఉపయోగించగా జోర్డాన్ సైన్యం కూడా సహకరించింది. ఐసిస్ స్థావరాలు, ఆయుధ గిడ్డంగులపై 100కు పైగా క్షిపణులు ప్రయోగించారు. సిరియాలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ చర్యలకు మద్దతు ఇచ్చింది. ప్రస్తుతం అక్కడ వెయ్యి మంది అమెరికా సైనికులు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో ఉన్నారు. ఈ దాడులతో ఐసిస్ బలహీనపడిందని భావిస్తున్నప్పటికీ, దాడులు ఇంకా కొనసాగుతాయా అనే సందేహాలు ఉన్నాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పుతిన్ యుద్ధాన్ని ఎందుకు సాగదీస్తున్నారో అర్థం కావడం లేదు…
ఇజ్రాయెల్ నుంచి ట్రంప్కు అత్యున్నత గౌరవం: ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ ప్రకటింపు
External Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది : సిరియాపై బాంబులతో విరుచుకుపడిన యుద్ధ విమానాలు