UK-China: ట్రంప్ బెదిరింపుల ప్రభావమో ఏమో కానీ, అమెరికా మిత్రదేశాలు క్రమంగా దూరమవుతున్నట్లు పరిస్థితులు సూచిస్తున్నాయి. ఇటీవల భారత్తో యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోగా, ఇప్పుడు మరో మిత్రదేశమైన బ్రిటన్ చైనాతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిణామాలు అమెరికాను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే భారత్–ఈయూ డీల్ తమను నిరాశపరిచిందని అమెరికా ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు. తాజాగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను కలవడం, అలాగే ఫ్రాన్స్, కెనడా నేతలు కూడా చైనాను సందర్శించడం అమెరికాకు అసంతృప్తిని కలిగిస్తోంది.
చైనా పర్యటన అనంతరం కీర్ స్టార్మర్ మాట్లాడుతూ అభివృద్ధి, భద్రత కోసం చైనాతో సమతుల్య సంబంధాలు కోరుకుంటున్నామని చెప్పారు. విభేదాలు ఉన్నా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్రదేశాలపై కూడా కఠిన వ్యాఖ్యలు చేయడం వివాదాలకు దారితీసింది. కెనడా, గ్రీన్లాండ్పై చేసిన వ్యాఖ్యలు ఐరోపా దేశాలను ఆగ్రహానికి గురిచేశాయి. ఈ కారణాలతోనే అమెరికా–మిత్రదేశాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
అమెరికాకు దూరమవుతోన్న మిత్ర దేశాలు.. చైనాతో బ్రిటన్ కీలక ఒప్పందం