రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవాలయాల పరిధిలో భారీగా భూములు ఉన్నాయి. కొన్ని భూములు సాగులో ఉండగా, మెజారిటీ భూములు ఏ అవసరాలకూ వినియోగించకుండా వదిలేశారు. ఇలాంటి భూములను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు ఎండోమెంట్ శాఖ వ్యర్థ భూముల్లో సోలార్ పవర్ యూనిట్లను నెలకొల్పేందుకు వినూత్న ఆలోచన చేసింది. ఎండోమెంట్ శాఖ మంత్రి కొండా సురేఖ సూచనల మేరకు రాష్ట్ర అధికారులు అన్ని జిల్లా స్థాయి అధికారులకు సోలార్ పవర్ యూనిట్లకు అనువైన భూములను గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు.

పాత కరీంనగర్ జిల్లాలో గుర్తించిన భూముల వివరాలు:

జగిత్యాల్ – శ్రీ సీతారామ స్వామి – కొడిమియాల్ – కొడిమియాల్ – 10.44
కరీంనగర్ – అనంత పద్మనాభ స్వామి – నుస్తులాపూర్ – తిమ్మాపూర్ – 5
జగిత్యాల్ - శ్రీ శివాలయం స్వామి - కొండాపూర్ - వెల్గటూర్ 3.24
జగిత్యాల్ – శ్రీ కోటేశ్వర స్వామి – కోటిలింగాలు – వెల్గటూర్ – 1.08
సిరిసిల్ల – లక్ష్మీనర్సింహ స్వామి – తంగళ్లపల్లి – తంగళ్లపల్లి – 0.39 ఎకరాలు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *