హైదరాబాద్‌: నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జూన్‌ 8న బత్తిని కుటుంబీకులచే ఏటా ‘చేప ప్రసాదం’ ప్రజలకు పంపిణీ చేయనున్నారు.ఆస్తమా, ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి ప్రతి సంవత్సరం బత్తిని కుటుంబం చేప ప్రసాదం పంపిణీ చేస్తుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా జూన్ 8న జరిగే పవిత్రమైన మృగశిర కార్తె సందర్భంగా వితరణ కొనసాగించాలని నిర్ణయించారు.ఏటా ఆచారంగా బత్తిని కుటుంబీకుల ఇంటి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబ సమేతంగా దూద్‌బౌలిలో చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంది. 2023లో సుమారు రెండు లక్షల మందికి చేప ప్రసాదాన్ని అందించారు. ఈ ఏడాది వీటి సంఖ్య పెరుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.ప్రజల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను వారు అభ్యర్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *