హైదరాబాద్‌ రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు భారీగా మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 591 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సిటీ సెల్ ద్వారా మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. బాధితులకు సీపీ మొబైల్ ఫోన్లు అందజేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న 591 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 5న సీపీ సుధీర్ బాబు బాధితులకు ఫోన్లు అందజేశారు. వాటి విలువ దాదాపు 2 కోట్లు.

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 339 ఫోన్లు, భువనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 103 ఫోన్లు, మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 149 ఫోన్లు మొత్తం 591 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఫోన్లు పోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బాధితుడు వెంటనే ఫోన్ పోతే, ఫోన్ నంబర్ మరియు IMII ఇస్తే రికవరీ సాధ్యమవుతుంది అని రాచకొండ కమీషనర్ సుధీర్ బాబు తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *