News5am, Breaking News Telugu Online (15-05-2025): మండుటెండల్లో వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు కొంత ఉపశమనం పొందుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో రోడ్లు కాలువలుగా మారాయి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హిందూపురం, పరిగి, కదిరి, అనంతపురం, గుత్తి మండలాల్లో వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో పలు కాలనీలు నీటిమునిగిపోయాయి. నడుము లోతు నీరు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మరియు స్థానికులు కలిసి నీటిలో చిక్కుకున్నవారిని రక్షిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహిదీపట్నం, అత్తాపూర్, ఫలక్ నుమా, అల్వాల్, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీ, చింతల్, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. వర్షాల కారణంగా వాహనదారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తుండటంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. చేతికి వచ్చిన పంట నీటిపాలవడంతో రైతులు కలత చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే సహాయం చేయాలని వారు కోరుతున్నారు.
More Breaking Telugu News
Breaking News Telugu Online:
రికార్డులు బద్దలు కొట్టిన ‘అయ్యనా మానే’..
More News: External Sources
ఎడతెరిపి లేని వర్షాలు.. జలదిగ్బంధంలో చిక్కుకున్న పలు కాలనీలు..