Gold Wave Grips Telangana: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రంగా పెరుగుతోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతూ పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్లో నమోదవుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కోల్డ్ వేవ్, సివియర్ కోల్డ్ వేవ్ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న చలి గాలుల ప్రభావంతో మరో రెండు మూడు రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం వేళల్లో రాష్ట్రవ్యాప్తంగా దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది.
గురువారం ఉదయం కుమ్రం భీం ఆసిఫాబాద్లో అత్యల్పంగా 6.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్ వంటి జిల్లాల్లో కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనూ చలి తీవ్రంగా ఉండగా, ఉదయం 9 గంటల వరకు చలిగాలులు వణికించాయి. నగర అవుట్స్కర్ట్స్ ప్రాంతాల్లో కూడా చలి ప్రభావం స్పష్టంగా కనిపించింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
LG ఎలక్ట్రానిక్స్ షేరు ధర IPO ధర కంటే 51% పెరిగింది..
External Links:
తెలంగాణలో పంజా విసురుతున్న చలి.. పలు జిల్లాలో సివీయర్ కోల్డ్ వేవ్స్.. ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ