Cough syrup Alert: దగ్గు సిరప్ ఇప్పుడు దేశంలో ప్రమాదకరంగా మారింది. కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా మధ్యప్రదేశ్లో, చిన్నారులు దీని కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీన్ని క్రమంగా నివారించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. పిల్లలకు దగ్గు సిరప్ ఇవ్వడంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తాజాగా తెలంగాణ ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. రెండు సంవత్సరాల క్రింద పిల్లలకు కఫ్, కోల్డ్ సిరప్ ఇవ్వొద్దని ఆదేశించింది. కఫ్, కోల్డ్ సమస్యలు సాధారణంగా తాత్కాలికమేనని, ఎక్కువసార్లు స్వయంగా తగ్గుతాయని హెల్త్ డైరెక్టర్ తెలిపారు. హోమ్ కేర్, నీటి పానీయాలు, విశ్రాంతితో మొదట ప్రయత్నించాలని, జీఎంపీ ప్రమాణాలతో ఉన్న సిరప్ మాత్రమే వాడాలని, ప్రమాదకరమైన సిరప్లను ఉపయోగించకూడదని సూచించారు. బ్యాచ్ నంబర్ SR-13, మే 2025లో తయారు, ఏప్రిల్ 2027 గడువు ఉన్న సిరప్ రీకాల్ చేయాలని ఆదేశించబడింది. ప్రజల్లో అవగాహన కోసం జిల్లా వైద్యాధికారులు, టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969 అందుబాటులో ఉంచారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology. It focuses on presenting news in short, easy-to-read formats for quick understanding“.
Internal Links:
అరేబియా సముద్రంలో తీవ్ర తుఫాన్…
తెలుగు రాష్ట్రాలకు నాలుగు రోజుల పాటు వర్ష సూచన..
External Links:
దగ్గు సిరప్పై తెలంగాణ ఆరోగ్యశాఖ అలర్ట్.. మార్గదర్శకాలు విడుదల