Cyclone Shakhti: అరేబియా సముద్రంలో తీవ్ర “శక్తి” తుఫాన్ ఏర్పడి తీరం వైపుకు దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఇది తీరానికి సుమారు 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గుజరాత్, పశ్చిమ-నైరుతి దిశగా తుఫాన్ కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్ ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలులు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచవచ్చని పేర్కొంది. అధికారులు మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రుతుపవనాల తర్వాత అరేబియా సముద్రంలో ఏర్పడిన ఇది తొలి తుఫాన్ అని పేర్కొంది.
గుజరాత్ తీరంలో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉండి, అలలు భారీగా ఎగిసిపడతాయని హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోమవారం ఉదయం నాటికి తుఫాన్ తూర్పు-ఈశాన్య దిశగా తిరిగి బలహీనపడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర, పాకిస్థాన్ తీరప్రాంతాల్లో పరిస్థితులు ఉధృతంగా ఉండవచ్చని తెలిపింది. అలాగే ముంబై, థానే, పాల్ఘర్, రాయ్గడ్, రత్నగిరి, సింధుదుర్గ్ ప్రాంతాల్లో అక్టోబర్ 7 వరకు భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology. It focuses on presenting news in short, easy-to-read formats for quick understanding“.
Internal Links:
తెలుగు రాష్ట్రాలకు నాలుగు రోజుల పాటు వర్ష సూచన..
తెలంగాణ వ్యాప్తంగా.. మరో మూడు గంటలు నాన్ స్టాప్ వర్షం..
External Links:
అరేబియా సముద్రంలో తీవ్ర తుఫాన్.. బీభత్సం సృష్టించే అవకాశం