హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ఏజెన్సీ (హైడ్రా) అక్రమ కూల్చివేతలను కొనసాగిస్తోంది. గగన్ పహాడ్లో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేడు కూల్చివేస్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి అప్ప చెరువు ఎఫ్టిఎల్ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను భారీ బందోబస్తు మధ్య కూల్చివేస్తున్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న ప్రాంతంలోకి మరెవరూ రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. అప్ప చెరువు మొత్తం విస్తీర్ణం 35 ఎకరాలు. 3.5 ఎకరాలను ఆక్రమించి గోడౌన్లు నిర్మించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. ఎఫ్టీఎల్ కింద అక్రమ నిర్మాణాలను తొలగించాలని బిల్డర్లను ముందుగానే హెచ్చరించినా వారి నుంచి కదలిక రాకపోవడంతో హైడ్రా రంగంలోకి దిగింది. అయితే కూలుస్థున్న గోడౌన్లు స్థానిక మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి వే అని స్థానికంగా తెలుస్తోంది. కాసేపటి క్రితం తోకల శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కూలుస్తున్న గోడౌన్లుపై శ్రీనివాస్ రెడ్డి ఏలాంటి స్పందన లేకపోవడం విశేషం.
నీటిపారుదలశాఖ అధికారుల సమాచారం మేరకు నేడు 3.5 ఎకరాలు మాత్రమే ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. కానీ 2014లోనే 4 ఎకరాలు, 6.8 ఎకరాల అప్ప చెరువు ఎఫ్టీఎల్ భూమి 2020 వరకు ఆక్రమణకు గురైనట్లు స్థానిక సమాచారం. మొత్తం 13 నిర్మాణాలను గుర్తించిన హైడ్రా అధికారులు. హైడ్రా అధికారులు ఇప్పటి వరకు రెండు నిర్మాణాలను కూల్చివేశారు. వర్షం పడుతున్నా కూడా ఆగని కూల్చివేతలు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కాల్వలు, కుంటల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా అక్రమార్కుల గుండెల్లో పరుగులు పెడుతోంది. బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు, పెద్ద భవనాలను ఎఫ్టీఎల్ కూల్చివేస్తోంది. ఇందులో భాగంగానే హీరో నాగార్జున కన్వెన్షన్ ను హైడ్రా కూల్చేసిన సంగతి తెలిసిందే.