జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమ్రపాలిని హెచ్ఎండీఏ, మూసీ అభివృద్ధి, హెచ్జీసీఎల్ అదనపు బాధ్యతల నుంచి ప్రభుత్వం రిలీవ్ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించింది.
దానకిశోర్కు మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా, సర్ఫరాజ్ అహ్మద్కు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా కోట శ్రీవాస్తవ నియమితులయ్యారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా చహత్ బాజ్ పాయ్, హైదరాబాద్ జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మయాంక్ మిట్టల్ నియమితులయ్యారు.