గ్రూప్ 1 మెయిన్స్కు అడ్డంకులు తొలగిపోయాయి. తెలంగాణ హైకోర్టులో దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష యథావిధిగా జరగనుంది. తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థులకు ఊరట లభించింది. ప్రిలిమ్స్ రద్దు చేయాలంటూ దాఖలైన రెండు దరఖాస్తులను జూన్ 9న హైకోర్టు కొట్టివేసింది. 563 పోస్టులకు టీజీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ ఈ ఏడాది ఫిబ్రవరి 22న విడుదలైంది. జూన్ 9న జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు 3.02 లక్షల మంది హాజరుకాగా, 31,382 మంది మెయిన్స్కు ఎంపికయ్యారు.
గ్రూప్1 మెయిన్ ఎగ్జామ్కు కోర్టు అడ్డంకులు తొలగిపోవడంతో మెయిన్స్ కు ఎంపికైన వారికి ఈ నెల 21 నుంచి 27 వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది, మెయిన్ ఎగ్జామ్ కు మొత్తం 6 పేపర్లు ఉండగా, 150 మార్కులు ఉంటాయి. గ్రూప్ 1 మెయిన్స్ ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ లో మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తామని తెలిపింది టీజీపీఎస్సీ.