ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెంలో కేరళ ఎక్స్ప్రెస్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కేరళ ఎక్స్ప్రెస్ తిరువనంత పురం నుంచి ఢిల్లీకి వెళ్తుండగా పాపటపల్లి రైల్వేస్టేషన్కు చేరుకుంది. ఈ రైల్వే స్టేషన్ చివరలో వృద్ధుల కోసం నిర్మించిన చప్టా మీదుగా సోమవారం ఓ వ్యక్తి తన బైక్పై ట్రాక్ దాటేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో కేరళ ఎక్స్ప్రెస్ రావడంతో బైక్ను అక్కడే వదిలేసి పారిపోయాడు. బైక్ను ట్రైన్ ఢీకొట్టి చాల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. వెంటనే లోకోపైలెట్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బైక్ భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయని, బైక్ కవర్లో ఉన్న సెల్ఫోన్ కూడా పూర్తిగా ధ్వంసమైందని పోలీసులు వివరించారు. అయితే బైక్ నెంబరు సాయంతో రైల్వే పోలీసులు, ధరావత్ వీరన్నదిగా గుర్తించారు.