AP Rains

News5am, Latest Breaking Telugu News-2 (28-05-2025): హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎలాంటి నష్టం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాతావరణ శాఖ సూచించిన భారీ వర్షాల హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్ పరిధిలో అన్ని శాఖల అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు.

రోడ్లపై నీరు నిలవకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా, విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరకుండా చూసుకోవాలని, ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన సీఎం, గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో వర్ష పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావుకు ఆదేశించారు.

More News:

Latest Breaking Telugu News-2

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉభయ రాష్ట్రాల్లో వర్షాలు

ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు..

More Latest Breaking General News: External Sources

తెలంగాణలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *