Madhav Gadgil: ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త, పశ్చిమ కనుమల పరిరక్షణకు జీవితాంతం కృషి చేసిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత మాధవ్ గాడ్గిల్ ఇకలేరు. 83 ఏళ్ల వయసున్న ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పూణేలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు, పర్యావరణవేత్తలు మాధవ్ గాడ్గిల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత జీవ వైవిధ్యం కలిగిన పశ్చిమ కనుమల పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి అపూర్వమైంది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సేవలకు గుర్తింపుగా 2024 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘చాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డు’ ఆయనకు లభించింది. మాధవ్ గాడ్గిల్ మరణంతో దేశ పర్యావరణ రంగంలో ఒక గొప్ప అధ్యాయం ముగిసిందని పలువురు భావిస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.
External Links:
ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత