ముంబైలోని లోయర్ పరేల్‌లోని కమలా మిల్ కాంపౌండ్‌లోని ఏడు అంతస్తుల టైమ్స్ టవర్ వాణిజ్య సముదాయంలో శుక్రవారం (సెప్టెంబర్ 6, 2024) ఉదయం 6.30 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీసీఐ) అధికారులు తెలిపారు. తొమ్మిది ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాణ నష్టంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు. 14 అంతస్తుల వాణిజ్య భవనం వెనుక 3వ అంతస్తు నుంచి 7వ అంతస్తు వరకు ఉన్న విద్యుత్‌ డక్ట్‌లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది పనిచేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *