National Breaking Telugu News News5am, (05-05-2025): భారత్ మరోసారి తన సైనిక శక్తిని చాటింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట పాకిస్తాన్ మరియు పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళాలు భారీ దాడులకు దిగాయి. ఇందులో జైషే మహమ్మద్కు చెందిన నాలుగు కీలక శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బహావల్పూర్లోని మర్కజ్ సుభాన్ అల్లా ప్రాంతంలో ఉన్న 15 ఎకరాల శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదుల తాలూకు కేంద్రాన్ని నేలమట్టం చేశారు.
భారత్ చేసిన ఈ క్షిపణి దాడుల్లో సుమారు 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. లష్కరే తోయిబా శిబిరాలపై కూడా దాడులు జరిపారు. పాకిస్తాన్ ఆరోపణల ప్రకారం, భారత్ 24 మిస్సైళ్ళను ప్రయోగించగా, ఈ దాడుల్లో 8 మంది పౌరులు మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. ఈ దాడులతో పాక్ ఉగ్రవాద శిబిరాల్లో భయానక వాతావరణం నెలకొంది. భారత రక్షణ శాఖ ప్రకారం, ఇది ఉగ్రవాదంపై నిఖార్సైన ప్రతీకార చర్యగా పేర్కొంది.
More National Breaking Telugu News
మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఆర్టీసీ సంఘాల నేతలు కలిశారు..
నేడు సోషల్ మీడియాలో ప్రధాని స్పందన…
More Breaking Telugu New: External Sources
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్: భారత సైనిక సామర్థ్యంలో సరికొత్త అధ్యాయం