ఈసారి ధర ఎంత ఉంటుందన్న ఉత్కంఠ వీడింది. కొలను శంకర్ రెడ్డికి బాలాపూర్ లడ్డూ లభించింది. వేలంలో కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ గణేశుడి లడ్డూ రూ. 30 లక్షల 1 వెయ్యికి కైవసం చేసుకున్నారు. ప్రతి సంవత్సరం బాలాపూర్ లడ్డూ వేలం రికార్డు ధర పలుకుతోంది. అందుకే భక్తులకు ప్రీతిపాత్రమైన గణనాథుని లడ్డూ వెలం పాట కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. ఊరేగింపు అనంతరం బొడ్రాయి గ్రామంలో లడ్డూల వేలం ప్రారంభమైంది. బాలాపూర్ లడ్డూలు ఈసారి మూడు లక్షల రూపాయలు పెరిగాయి.
అంటే, గతేడాది రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూను ఈ ఏడాది ఏకంగా, రూ. 30 లక్షల 1 వెయ్యికి గాను బాలాపూర్ గణేశుడి లడ్డూను కొలను శంకర్ రెడ్డి కుటుంబం కైవసం చేసుకుంది.
