RBI Recruitment 2025: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. పరీక్ష లేకుండా ఉద్యోగాలు పొందే అవకాశం కల్పిస్తూ లాటరల్ రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా మొత్తం 93 గ్రేడ్-C పోస్టులను భర్తీ చేయనున్నారు. డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, ఐటీ సెక్యూరిటీ నిపుణుడు, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, ప్రాజెక్ట్ మేనేజర్, క్రెడిట్ రిస్క్ స్పెషలిస్ట్ వంటి విభాగాల్లో అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులన్నీ పూర్తి కాలం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి. ఆసక్తి, అర్హత ఉన్నవారు 2026 జనవరి 6 వరకు ఆన్లైన్లో అప్లై చేయవచ్చు.
ప్రతి పోస్టుకు వేర్వేరు విద్యార్హతలు, అనుభవం అవసరం. సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ లేదా ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు కొన్ని సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల వయోపరిమితి పోస్టు ఆధారంగా కనీసం 25 నుంచి గరిష్టంగా 62 సంవత్సరాల వరకు నిర్ణయించారు. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష ఉండదు; స్క్రీనింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.600 ప్లస్ జీఎస్టీ కాగా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో పొందుపరిచారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
LG ఎలక్ట్రానిక్స్ షేరు ధర IPO ధర కంటే 51% పెరిగింది..
External Links:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పరీక్ష రాయకుండానే జాబ్ పొందే ఛాన్స్.. వెంటనే అప్లై చేసుకోండి