అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 చిత్రం గురువారం రాత్రి ప్రీమియర్లతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. హైదరాబాద్లో పుష్ప-2 ప్రీమియర్లును ప్రదర్శించారు. గురువారం రాత్రి 9:30 గంటలకు సంధ్య థియేటర్లోని ఆర్టీసీ క్రాస్రోడ్స్లో జరిగిన పుష్ప ప్రీమియర్ షోకు సినీ హీరో అల్లు అర్జున్ మరియు అతని భార్య స్నేహ హాజరయ్యారు. అల్లు అర్జున్ వస్తున్నాడు అని తెలియడంతో అల్లు అభిమానులు సంధ్య థియేటర్ కు భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో థియేటర్ వద్ద తొక్కి సలాట జరిగింది.
తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్ , ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7) కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ రోడ్స్ లోని సంధ్య 70 mm కు వచ్చారు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చిన సమయంలో అభిమానులు థియేటర్ గేటు లోపలికి ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసారు. ఈ తొక్కిసలాట లో రేవతి , ఆమె కొడుకు శ్రీ తేజ లు కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వారిద్దరిని వెంటనే పోలీసులు విద్య నగర్ లోని దుర్గ భాయి దేశముఖ్ హాస్పిటల్ కు తరలించారు. రేవతి అప్పటికే మృతి చెందగా , శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చురీకి తరలించారు.