పూణెలోని పింప్రి చించ్‌వాడ్‌ ప్రాంతంలో బుధవారం ఓ విషాద ఘటన నెలకొంది. చిన్నారి తోటి స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ఇనుప గేటు ఆమెపై పడటంతో మూడున్నరేళ్ల బాలిక మరణించింది. బుధవారం బోప్‌ఖేల్ ప్రాంతంలో నలుగురు చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వారిలో ఇద్దరు ఇనుప గేటు గుండా లోపలికి రాగా, అనంతరం గేటును వేయగా. అదే సమయంలో అక్కడికి వచ్చిన మూడేళ్ల చిన్నారిపై ఇనుప గేటు ఒక్కసారిగా పడుతుంది. దీంతో భయాందోళనకు గురైన ఇతర పిల్లలు అక్కడినుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన చిన్నారిని గిరిజా గణేష్ షిండేగా పరిగణించారు. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వీధిలోని ఓ ఇంటి వద్ద సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో,ప్రస్తుతం సామజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. గేటు చెడిపోయిందని ఇరుగుపొరుగు వారు, భవన యజమానికి తెలుసు అని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీసీపీ శివాని పవార్‌ తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *