హైదరాబాద్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా భూమి పొరల నుంచి పొగలు వచ్చి బీభత్సం సృష్టించాయి. ఈ ఘటన గురువారం కేబీఆర్‌ పార్క్‌లో చోటుచేసుకుంది. ఇది చూసిన జ‌నం ఆశ్చర్యపోయారు. మొద‌ట త‌క్కువ‌గా వ‌చ్చిన పొగ‌లు, ఆ త‌ర్వాత క్ర‌మంగా పెరిగిన‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉండగా తాజాగా విద్యుత్ శాఖ అదే ప్రాంతంలో భూగర్భంలో 11కేవీ కేబుల్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పొగలు ఎగసిపడి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. అయితే పొగ రావడానికి అసలు కారణాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *