Droupadi Murmu Visits Tirumala

Droupadi Murmu Visits Tirumala: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద రాష్ట్ర మంత్రులు, టీటీడీ చైర్మన్, ఈవో సహా అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు రాష్ట్రపతికి వేదాశీర్వచనాలు చెప్పి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారి చిత్రపటాన్ని కూడా అందించారు.

తిరుమల పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రాంభగీచ సర్కిల్ వద్ద రాష్ట్రపతి ముర్ము తన కాన్వాయ్ ఆపి భక్తులను స్వయంగా పలకరించారు. భక్తులతో కరచాలనం చేసి, వారికి చాక్లెట్స్ పంచారు. రాష్ట్రపతి అనూహ్యంగా దిగడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆమె ముందుగా తిరుచానూరులో అమ్మవారిని దర్శించుకుని, అనంతరం తిరుమల చేరి ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్..

SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.

External Links:

తిరుమలలో శ్రీవారిని దర్శించుకన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *