తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు సర్కార్ శుభవార్త అందించింది. తాజాగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు దసరా పండుగ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఏడాది దసరా సెలవులు 13 రోజులు. అంటే అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని విద్యాశాఖ ప్రకటించింది.అక్టోబర్ 2 గాంధీ జయంతి కావడంతో అప్పటి నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కాకపోతే ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 1 నుంచి సెలవులు ప్రకటించారు. అక్టోబరు 15న పునఃప్రారంభమవుతుందని విద్యార్థులకు కూడా సమాచారం అందించినట్లు సమాచారం.
ఈ సెలవులు వస్తే విద్యార్థులంతా ఆనందంగా పట్టణాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, రాష్ట్రంలో దసరా సెలవుల అనంతరం విద్యాసంస్థలకు మళ్లీ డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు రానున్నాయి. ఆ తర్వాత వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. పాఠశాలలు ఏప్రిల్ 23, 2025న నిర్వహించబడతాయి, ఆపై ఫిబ్రవరి 28 నాటికి పదో తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షలు పూర్తవుతాయి. 10వ తరగతి వార్షిక పరీక్షలు 2025 మార్చిలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.