పశ్చిమ బెంగాల్‌లో ‘దానా’ తుఫాను ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన ఈ వాయుగుండం కారణంగా కోల్‌కతా సహా దక్షిణ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను కారణంగా ఈ నెల 24, 25 తేదీల్లో తూర్పు, దక్షిణ రైల్వేల్లో 150 రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణలోనూ వాతావరణం ప్రభావం చూపనుంది. పలుచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

శుక్రవారం తెల్లవారుజామున ఒడిశాలోని భితార్కానికా నేషనల్‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌, ధామ్రా ఓడరేవుల మధ్య గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుఫాను బుధవారం ఉదయం పారాదీప్‌‌‌‌‌‌‌‌కు 520 కిలోమీటర్లు, సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వీపానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లడించింది. ఈ నెల 24, 25 తేదీల్లో సౌత్‌‌‌‌‌‌‌‌ బెంగాల్‌‌‌‌‌‌‌‌లోని జిల్లాలతో పాటు 24 పరగణాలు, పుర్బా, పశ్చిమ్‌‌‌‌‌‌‌‌ మెదినీపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రామ్‌‌‌‌‌‌‌‌ , కోల్‌‌‌‌‌‌‌‌కతా, హౌరా, హుగ్లీ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *