Telangana Government: చిన్నారుల ఆరోగ్య భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్రమైన అనారోగ్యాలు, మరణాలకు కారణమవుతున్నాయని ఆరోపణలు ఉన్న మూడు దగ్గు మందులపై ప్రభుత్వం తక్షణ నిషేధం విధించింది. రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్ సిరప్ల విక్రయాన్ని నిషేధిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు కోల్డ్రిఫ్ దగ్గుమందుపై కూడా నిషేధం విధించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో కోల్డ్రిఫ్ వాడకం వల్ల 16 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కాంచీపురం కేంద్రంగా పనిచేస్తున్న స్రెసన్ ఫార్మాస్యూటికల్స్ తయారీపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దృష్టి సారించింది.
ఈ నిషేధాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, ఫార్మసీలు తక్షణమే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా పిల్లలకు ఎలాంటి దగ్గు, జలుబు మందులు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు. స్వంతంగా మందులు ఇవ్వడం ప్రమాదకరమని, ఏ చిన్న అనారోగ్యానికైనా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని అధికారులు హెచ్చరించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ బహుమతి…
ఆస్పత్రి ఐసీయులో అగ్నిప్రమాదం…
External Links:
మూడు దగ్గు మందులను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం