Transfers In GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో విస్తృత స్థాయిలో డిప్యూటీ కమిషనర్ల బదిలీలు జరిగాయి. GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ గురువారం 23 మంది డిప్యూటీ కమిషనర్ల బదిలీకి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో కొంతమందికి పదోన్నతులు ఇవ్వడంతో పాటు కొత్త పోస్టింగ్లు కేటాయించారు. ఖైరతాబాద్ సర్కిల్కు జయంత్ను, యూసఫ్గూడా డీసీగా రజనీకాంత్ రెడ్డిని నియమించారు. మల్కాజ్ గిరి డిప్యూటీ కమిషనర్గా జకియా సుల్తానా, చందానగర్కు శశిరేఖ, ఉప్పల్కు రాజును నియమించారు. అలాగే సికింద్రాబాద్కు ఆంజనేయులు, గోషామహల్కు ఉమా ప్రకాష్, రాజేంద్రనగర్కు రవికుమార్, ఎల్బీనగర్కు మల్లికార్జునరావు, హయత్నగర్కు వంశీకృష్ణను నియమించారు.
మూసాపేట్ డిప్యూటీ కమిషనర్గా సేవా ఇస్లావత్, బేగంపేట్కు డాకు నాయక్ను నియమించారు. ఈ బదిలీలు, కొత్త పోస్టింగ్లు GHMC పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకున్న చర్యలుగా కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Internal Links:
విశాఖ యోగా డేలో ప్రధాని మోదీ..
తల్లికి ఫోన్ చేసిన నిమిషాల తర్వాత, డాక్టర్ ముంబై సీ లింక్ నుండి దూకాడు..
External Links:
జీహెచ్ఎంసీ పరిధిలో బదిలీలు.. 23 మంది డిప్యూటీ కమిషనర్ల పోస్టింగ్ మార్పు..!