ఈ నెల 11న మంత్రి కొండా సురేఖ చొరవతో వరంగల్ జిల్లా ఈస్ట్ లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 8,000కు పైగా ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో దాదాపు 100 కంపెనీలు ఈ జాబ్ మేళాను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. సోమవారం తన నివాసంలో జాబ్ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్ను మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. అనంతరం జాబ్ మేళా నిర్వాహకులు పరిశీలించారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని జాబ్ మేళాకు వచ్చే యువతీ, యువకులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఇప్పటికే జాబ్ మేళాకు 60 కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకోగా మరో 40 నుంచి 50 కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. 8 వేలకుపైగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని వివరించారు.