కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో జూలై 30వ తేదీన సంభవించిన ప్రకృతి విపత్తుతో దాదాపు 400 మందికి పైగా ప్రజలు మరణించగా, మరో 200 మంది ఆచూకీ గల్లంతైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వయనాడ్‌ను సందర్శించనున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉదయం 11 గంటలకు కన్నూర్‌లో మోడీకి స్వాగతం పలుకుతారు, తర్వాత వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను వైమానిక పరిశీలన చేస్తారు.

రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న బృందాలు తరలింపు ప్రయత్నాల సహాయక చర్యలు గురించి వివరించనున్నారు. మరియు సహాయ శిబిరం మరియు ఆసుపత్రిని సందర్శిస్తారు, అక్కడ కొండచరియలు విరిగిపడిన బాధితులు, ప్రాణాలతో బయటపడిన వారిని నరేంద్ర మోడీ పరామర్శిస్తారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, ఈ సందర్భంగా సంఘటన మరియు కొనసాగుతున్న సహాయక చర్యల పరిస్థితుల గురించి అధికారులను ప్రధాని మోడీ అడిగి తెలుసుకోనున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *