యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపూర్ గ్రామంలోని జయ లేబరేటరీ కెమికల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో ఆరుగురు కార్మికులు గాయపడ్డారు. ల్యాబొరేటరీస్లోని కెమికల్ ప్లాంట్ నుంచి వెలువడిన విషవాయువుకు గురికావడంతో వారు స్పృహతప్పి పడిపోయి గాయాలపాలయ్యారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున జరిగినప్పటికీ, స్థానిక అధికారులు దీనిపై ఎటువంటి సమాచారం లేదని పేర్కొన్నారు.
