ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన చిత్రాల్లో ఒకటి. సాయిపల్లవి ప్రధాన పాత్రలో దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన చిత్రమిది. గురువారం శ్రీకాకుళంలో మేకర్స్ థ్యాంక్యూ మీట్ ను నిర్వహించారు. ఈ వేడుకలో హీరోయిన్ సాయి పల్లవితో పాటు నిర్మాత అల్లు అరవింద్ కూడా ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. అంతకుముందు హీరో నాగ చైతన్య కూడా డ్యాన్స్ చేసి అలరించాడు. ఈ సందర్భంగా తమ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలిపారు.