ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కానీ ఈ సినిమాను ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడం చిత్రబృందం దృష్టికి వచ్చింది. సినిమా విడుదలైన రెండు రోజుల తర్వాత ఆర్టీసీ బస్సులో తండేల్ ప్రదర్శించడం పై నిర్మాత బన్నీ వాసు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని ఆయన ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. బస్సులో పైరసీ ప్రింట్‌ను ప్రదర్శించడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ స్పందించారు. బస్సులో తండేల్ సినిమా ప్రదర్శనపై విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *