Bhartha Mahasayulaku Wignyapthi: మాస్ జాతర ఫ్లాప్ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ ఈసారి దర్శకుడు కిషోర్ తిరుమలతో చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. నేనుశైలజా, చిత్రలహరి లాంటి హిట్ సినిమాలు తీసిన కిషోర్ తిరుమల ఈసారి పూర్తిగా ఫన్ జానర్లో, ఎమోషన్స్ కలిపి యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. వరుస మాస్ సినిమాల తర్వాత రవితేజ చాలా కాలానికి తన కంఫర్ట్ జోన్లో చేసిన సినిమా ఇదే అని ఓవర్సీస్ టాక్ చెబుతోంది.
ఈ సినిమాకు పెద్ద కథ ఏమీ లేదు, స్క్రీన్ప్లే కూడా గొప్పగా ఉండదు. కానీ ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతో దర్శకుడు కామెడీని బలంగా రాసుకున్నాడు. చాలా చోట్ల కామెడీ బాగా వర్క్ అయ్యింది. కొన్ని సీన్లు ఎక్కువగా అనిపించినా, సినిమా ఫ్లోకి ఇబ్బంది కలగలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కామెడీ ఎక్కువగా పండింది. సునీల్ చాలా రోజుల తర్వాత అదిరిపోయే కామెడీ చేయగా, సత్య కూడా తన టైమింగ్తో ఆకట్టుకున్నాడు. కథ గురించి ఎక్కువగా ఆలోచించకుండా కుటుంబంతో కలిసి సరదాగా నవ్వుకోవాలంటే ఈ సినిమా మంచి ఎంపిక అని, రవితేజ ఇటీవల చేసిన సినిమాలకన్నా ఇది బెస్ట్ అని ఓవర్సీస్ ప్రేక్షకులు చెబుతున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
రవితేజ ‘భర్త మహశయులకు విజ్ఞప్తి’ ఓవర్సీస్ రివ్యూ..