News5am, Breaking Telugu Latest Headlines (24-05-2025): మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో ‘ఖలేజా’ ఒక ప్రత్యేకమైన చిత్రం. యాక్షన్, కామెడీ, ఫాంటసీ లను సమపాళ్లలో మిళితం చేసిన ఈ ప్రయోగాత్మక సినిమా 2010లో విడుదలైంది. విడుదల సమయంలో భారీ అంచనాలు ఉన్నా, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. వాణిజ్య పరంగా ఫలితం నిరాశపరిచినా, త్రివిక్రమ్ ఈ సినిమాతో మహేష్ బాబును ప్రేక్షకులకు ఒక వినూత్నమైన కామెడీ షేడ్స్తో చూపించగలిగారు. మహేష్ చెప్పిన ప్రతి డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో, ఇప్పుడు ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారు.
ఈ నెల 30న ‘ఖలేజా’ 4K వెర్షన్లో ప్రపంచవ్యాప్తంగా తిరిగి విడుదల కాబోతుంది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి రోజురోజుకూ పెరిగిపోతుండగా, తాజా సమాచారం ప్రకారం బుక్ మై షోలో ఒక్క గంటలోనే 14 వేలకుపైగా టికెట్లు బుక్ అవుతుండటంతో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ స్పష్టమవుతోంది. ఇప్పటికే మహేష్ బాబు రీ రిలీజ్ అయిన ‘పోకిరి’ మరియు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలు మంచి స్పందన అందుకున్నాయి. ఇదే తరహాలో ‘ఖలేజా’ కూడా మరోసారి విజయవంతం అవుతుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
More Breaking Telugu Movie News:
Breaking Telugu Latest Headlines
‘బెగ్గర్’ టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన విజయ్ సేతుపతి..
‘కన్నప్ప’ నుంచి స్పెషల్ గ్లింప్స్..
More Latest Cinema News: External Sources
ఖలేజా రీ-రిలీజ్కు ఊహించని బుకింగ్స్..