Case Against Srikanth Bharat: జాతిపిత మహాత్మా గాంధీపై సినీ నటుడు శ్రీకాంత్ భరత్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద వివాదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ బషీర్బాగ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీడియాతో మాట్లాడుతూ, వాక్ స్వతంత్రం పేరుతో కొందరు హద్దులు మీరుతున్నారని, గాడ్సే వారసులమని చెప్పుకునే వారే గాంధీజీపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. సినీ పరిశ్రమ పెద్దలు కూడా ఈ విషయంపై స్పందించాలని ఆయన కోరారు.
అలాగే, త్వరలో ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి, శ్రీకాంత్ భరత్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరతానని వెంకట్ బల్మూరి తెలిపారు. ఈ విషయం ఇంతటితో ఆగదని, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
External Links:
గాంధీపై అనుచిత వ్యాఖ్యలు: నటుడు శ్రీకాంత్ భరత్పై దేశద్రోహం కేసు పెట్టాలని ఎమ్మెల్సీ ఫిర్యాదు