Karur Stampede: తమిళనాడులోని కరూర్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతిచెందగా, చాలా మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, తమిళనాడు ప్రభుత్వం దర్యాప్తు ఆదేశించింది. ఇప్పటికే విజయ్ మృతులకు, గాయపడిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
ఈ ఘటనపై విజయ్ ఒక వీడియోలో స్పందిస్తూ తన గుండె నొప్పితో తల్లడిల్లుతోందని, జీవితంలో ఇంత బాధాకరమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఎంతో ప్రేమతో వచ్చిన ప్రజలకు ఇలాంటి దుర్ఘటన జరగకూడదని విచారం వ్యక్తం చేశారు. సీఎం సర్ మీకు ప్రతీకారం తీర్చుకోవాలంటే నామీద చేసుకోవచ్చని, త్వరలోనే బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పారు. ప్రజలను కలిసేందుకు కరూర్కు వెళ్లలేదని, ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology. It focuses on presenting news in short, easy-to-read formats for quick understanding“.
Internal Links:
ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..
రష్మిక మందన్న థామా ట్రైలర్..
External Links:
నా గుండె నొప్పితో తల్లడిల్లుతోంది.. తొక్కిసలాటలో 41 మంది మృతి తర్వాత విజయ్ వీడియో విడుదల