సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పోలీసుల నోటీసుల నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంట్లో కీలక సమావేశం. అల్లు అర్జున్ తన న్యాయవాద బృందంతో సమావేశమయ్యారు. పోలీసుల నోటీసుల నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. రేపు విచారణలో అడిగే ప్రశ్నలపై పోలీసులు చర్చిస్తున్నారు. అల్లు అర్జున్ తన లీగల్ టీమ్ నుండి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాడు. రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని అల్లు అర్జున్కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరుపరిచేందుకు అరెస్టు చేశారు. ఇందుకోసం అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్న లీగల్ టీమ్ సభ్యులు, పోలీసులు అడగబోయే ప్రశ్నలపై చర్చిస్తున్నారు.
డిసెంబర్ 4న సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ను రేపు పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి 18మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా, ఇందులో అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. డిసెంబర్ 13న అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది. అనంతరం రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో నాలుగు వారాల బెయిల్ను మంజూరు చేసింది.