సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటకు, రేవతి మృతి కేసులో హీరో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యాడు. రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న నాంపల్లి కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని చిక్కడపల్లి పోలీసులను ఆదేశించింది.
ఈ కేసులో అల్లు అర్జున్ను పోలీసులు ఏ11 నిందితుడిగా చేర్చారు. తాజాగా, అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ను సోమవారం కోర్టు విచారించింది. పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్ను పరిశీలించారు. బెయిల్ కోసం అల్లు అర్జున్ తరఫు లాయర్లు, పోలీసుల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జనవరి 3న తీర్పును వెలువరిస్తామని పేర్కొంటూ కేసును వాయిదా వేసింది.